telugu navyamedia
సినిమా వార్తలు

13 సంవత్సరాల తరువాత మేకప్ వేసుకుంటున్న సీనియర్ హీరోయిన్

Vijayashanthi

దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కాశ్మీర్‌ షెడ్యూల్‌ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో నెక్స్ట్ షెడ్యూల్‌ జరుగుతోంది. 2020 సంక్రాంతి కానుకగా వరల్డ్‌వైడ్‌గా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు చిత్ర బృందం. సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో సీనియర్‌ హీరోయిన్‌ విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా… రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్‌ టి., ఎస్‌.కృష్ణ.. టెక్నీషియన్స్ గా పనిచేస్తున్నారు. ఈ సినిమాతో సీనియర్ హీరోయిన్ విజయశాంతి చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ కెమేరా ముందుకు రాబోతున్నారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత విజయశాంతి మళ్లీ మేకప్ వేసుకున్నారు. ఈ సందర్భంగా `సరిలేరు నీకెవ్వరు` దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశాడు. “13 సంవత్సరాల తర్వాత విజయశాంతిగారు మళ్లీ మేకప్ వేసుకున్నారు. ఈ 13 సంవత్సరాలలోనూ పెద్దగా ఏమీ మారలేదు. అదే క్రమశిక్షణ, అదే దృక్పథం, అదే డైనమిజమ్. విజయశాంతిగారికి స్వాగతం” అని అనిల్ రావిపూడి ట్వీట్ చేశాడు.

Related posts