telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరోసారి ఆ హీరోతోనే రొమాన్స్‌కు రెడీ అంటున్న పూజా !

స్టార్ హీరోయిన్ పూజా హిగ్దే వరుస సినిమాలతో బిజీ అయింది. ఈ అమ్మడి గ్రామర్‌కు కుర్రకారు గుడి కడుతున్నారు. దాంతో నిర్మాతలు కూడా ఈ ముద్దుగుమ్మను ప్రిఫర్ చేస్తున్నారు. ప్రస్తుతం పూజా చేతిలో మంచి ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటుగా అఖిల్ అక్కినేని హీరోగా చేస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలోనూ నటిస్తోంది. వీటితో పాటుగా మధ్యలో బాలీవుడ్‌లోను మెరవనుంది. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చేస్తున్న ‘కబీ ఈద్ కబీ దివాళి’ సినిమాలో కనిపించనుంది. అంతేకాకుండా రన్‌వీర్ సింగ్, రోహిత్‌తో కలిసి క్రికస్ అనే సినిమాలో చేస్తుంది. అంతేకాకుండా తమిళంలోనూ దుల్కర్ సల్మాన్‌తో కలిసి ఓ సినిమా చేయనుంది. అంతేకాదు… అన్నీ అనుకున్నట్టు జరిగితే… నాగ చైతన్యతో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ ఉందట. అక్కినేని నాగచైతన్య తాజా చిత్రం ‘లవ్ స్టోరీ’ ఏప్రిల్ 16న జనం ముందుకు రాబోతోంది. అదే విధంగా అతని కొత్త సినిమా ‘థ్యాంక్యూ’ ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరిపేసుకుంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే ను ఒక నాయికగా ఎంపిక చేయబోతున్నట్టు తెలుస్తోంది. నిజానికి నాగచైతన్య ‘ఒక లైలా కోసం’ మూవీతోనే పూజా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సో… తన తొలి చిత్ర కథానాయకుడితో మరోసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ కు ఈ చిన్నది సిద్ధం అవుతోందన్నమాట. చై – అఖిల్… ఇద్దరి సరసన నటించిన తొలి నటి నిధి అగర్వాల్ కాగా, పూజా హెగ్డే సైతం ఆ జాబితాలో చేరింది. ఏదేమైనా… అక్కినేని నాగార్జున నట వారసులతో పూజా హెగ్డే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేయడం విశేషమే!

Related posts