telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు వ్యాపార వార్తలు

ఏపీసీఎం జగన్ చేతులమీదుగా .. కియా మరో కొత్త కారు .. ..

new model car launch form KIA by apcm

ఈనెల 8న కియా కంపెనీ అనంతపురం జిల్లా పెనుగొండ ప్లాంటులో తన కొత్తకారు ”సెల్తోస్‌”ను మార్కెట్లోకి విడుదలచేస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ను కియా కంపెనీ ప్రతినిధులు ఆహ్వానించారు. ముఖ్యమంత్రి నివాసంలో కంపెనీ ఎండీ కూక్‌ హ్యున్‌ షిమ్, చీఫ్‌ అడ్మినిస్ట్రేవ్‌ ఆఫీసర్‌ థామస్‌ కిమ్‌ ముఖ్యమంత్రిని కలిసి కొత్తకారు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా విజ్ఞప్తిచేశారు.

ఏడాదికి 3 లక్షల కార్లను అనంతపురం జిల్లా పెనుగొండ ప్లాంటుద్వారా ఉత్పత్తిచేయగలమని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. భవిష్యత్తులో 7 లక్షల కార్లను తయారుచేసే సామర్థ్యానికి చేరుకుంటామని సీఎంకు వెల్లడించారు. ప్రస్తుతం టర్కీ, స్లొవేకియాలకు ఇంజిన్లనుకూడా ఎగుమతి చేస్తామన్నారు. కియా కొత్తకారు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ హాజరవుతున్నారు.

Related posts