ఈనెల 8న కియా కంపెనీ అనంతపురం జిల్లా పెనుగొండ ప్లాంటులో తన కొత్తకారు ”సెల్తోస్”ను మార్కెట్లోకి విడుదలచేస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి వైయస్.జగన్ను కియా కంపెనీ ప్రతినిధులు ఆహ్వానించారు. ముఖ్యమంత్రి నివాసంలో కంపెనీ ఎండీ కూక్ హ్యున్ షిమ్, చీఫ్ అడ్మినిస్ట్రేవ్ ఆఫీసర్ థామస్ కిమ్ ముఖ్యమంత్రిని కలిసి కొత్తకారు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా విజ్ఞప్తిచేశారు.
ఏడాదికి 3 లక్షల కార్లను అనంతపురం జిల్లా పెనుగొండ ప్లాంటుద్వారా ఉత్పత్తిచేయగలమని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. భవిష్యత్తులో 7 లక్షల కార్లను తయారుచేసే సామర్థ్యానికి చేరుకుంటామని సీఎంకు వెల్లడించారు. ప్రస్తుతం టర్కీ, స్లొవేకియాలకు ఇంజిన్లనుకూడా ఎగుమతి చేస్తామన్నారు. కియా కొత్తకారు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వైయస్.జగన్ హాజరవుతున్నారు.
బలహీనవర్గాల గొంతు నొక్కేందుకే కౌన్సిల్ రద్దు తీర్మానం: చంద్రబాబు