telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రిపబ్లిక్‌ డే పరేడ్‌…

ఈరోజు భారత దేశపు 72 వ రిపబ్లిక్ డే. అయితే ఈ సందర్బంగా దేశ రాజధానిలో వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొత్త శకటాలు, సైన్యం ఆయుధాలను ప్రదర్శించి, వాటిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా దేశ ప్రజలందరికీ చూపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఏడాది లక్షల మంది ఈ వేడుకలను నేరుగా తిలకించేవారు. కొవిడ్‌ నిబంధనల దృష్ట్యా… ఈ ఏడాది మాత్రం 25 వేల మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్ యుద్ధ విమానాలు… మొదటిసారి పరేడ్‌లో భాగం కానున్నాయి. 2020 సెప్టెంబర్లో ఈ విమానాలు భారత వాయుసేనలో చేరాయి. రాఫెల్ యుద్ధ విమానంతో వర్టికల్ ఛార్లీ ఫార్మేషన్‌ను చేయనున్నట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రతినిధులు తెలిపారు. ఓ రాఫెల్ యుద్ధ విమానం లీడ్ తీసుకుని… రెండు జాగ్వార్, రెండు మిగ్-29 ఫైటర్లతో కలిసి ఏకలవ్య ఫార్మేషన్‌ను చేసి ప్రదర్శించనుంది.  తొలి మహిళా ఫైటర్ ఈ ప్రదర్శనలో భాగం పంచుకోనున్నారు. పలు రకాల తేలికపాటి యుద్ధ విమానాలతో పాటు సుఖోయ్-30 జెట్లు కూడా కనువిందు చేయనున్నాయి. రిపబ్లిక్ వేడుకల్లో శకటాల ప్రదర్శనలో… లేహ్‌లో భాగమైన థిక్సే కొండలపై ఓ పర్యాటక కేంద్రంగా ఉన్న చారిత్రక మఠం నమూనా తొలిసారిగా ప్రదర్శనలో ఉండనుంది. యూపీలో నిర్మిస్తున్న రామాలయం నమూనా, ఏపీకి సంబంధించి లేపాక్షీ థీమ్ తో శకటం ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నాయి.

Related posts