telugu navyamedia
క్రైమ్ వార్తలు

బంగ్లాదేశ్ కంటైనర్ డిపోలో ఘోర అగ్నిప్రమాదం..

బంగ్లాదేశ్ ఢాకాలో ఘోర అగ్నిప్రమాదం జ‌రిగింది. ప్రైవేటు కంటైనర్ డిపోలో జరిగిన ఈ ప్రమాదంలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 450 మందికి గాయాలయ్యాయి. వీరిలో దాదాపు 20 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ పేలుడుకు ముందే డిపోలో మంటలు చెలరేగాయి.

వీటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్న సమయంలోనే పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు.

ఈ పేలుడు ధాటికి చుట్టుపక్కల ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు భయంతో ఇళ్ల నుండి పరుగులు తీశారు. పలువురి ఇళ్ల కిటీల అద్దాలు పగిలిపోయాయి చెల్లా చెదురైనట్టు తెలిపారు. .

శనివారం అర్ధరాత్రి చిట్టాగాంగ్​లోని సీతాకుందా ఉపజిలాజిలా ప్రాంతంలో ఉన్న బీఎం కంటైనర్ డిపోలోప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. 

కంటైనర్ డిపోలో రసాయనిక పదార్థాలు ఉండటం వల్లే భారీగా మంటలు వ్యాప్తి చెందినట్లు భావిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

Related posts