*గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో దారుణం
*యువతిపై అనుమానంతో గొంతుకోసిన యువకుడు..
*యువతి పరిస్థితి విషమం..ఆస్పత్రిలో చికిత్స..
ఆంద్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా లో దారుణం చోటుచేసుకుంది. సత్తెనపల్లిలో యువతిపై అనుమానంతో యువకుడు గొంతుకోశాడు. ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థతి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ యువతిని ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా.. తులసీరామ్ అనే యువకుడు గత కొంతకాలంగా యువతితో సహజీవనం చేస్తున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.