సీపీఐ నేత నారాయణ ఇంట విషాదం చోటుచేసుకుంది. సీపీఐ నారాయణ సతీమణి వసుమతి(65) గురువారం సాయంత్రం కన్నుమూశారు.
వసుమతి దేవి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆమె గుండెపోటుకు గురవ్వడంతో తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.
మూడు రోజులు క్రితం ఆమె గుండెకు స్విమ్స్ వైద్యులు స్టంట్ వేశారు. మరోసారి గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. భార్య మరణంతో సీపీఐ నారాయణ కన్నీటి పర్యంతమయ్యారు.
రేపు నగరి మండలం ఐనంబాకంలో వసుమతిదేవి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు. ఆమె మరణవార్త తెలిసిన సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు