telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

ప్రైవేటు ఆసుపత్రిలో మృతదేహాల మార్పిడి

vuhan-china corona

ఓ ప్రైవేటు ఆసుపత్రి నిర్లక్ష్యంతో మృతదేహాల మార్పిడి జరిగింది. ఒక కుటుంబానికి అప్పగించాల్సిన మృతదేహాన్ని మరో కుటుంబానికి అప్పగించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు శివారు ప్రాంతంలో ఉన్న రమేశ్ సంఘమిత్ర ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. కంభం ప్రాంతానికి చెందిన ఖలీల్ అహ్మద్ అనే వ్యక్తి కరోనాతో ఆసుపత్రిలో మరణించాడు. ఆసుపత్రి వర్గాలు ఖలీల్ మృతదేహాన్ని తీసుకువెళ్లాలంటూ కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు ఆసుపత్రి వద్దకు వచ్చారు.

మృతుడు ఖలీల్ మృతదేహానికి బదులు వీరయ్య అనే వ్యక్తి మృతదేహాన్ని ఇవ్వడంతో ఖలీల్ కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. గట్టిగా ప్రశ్నించగా, ఖలీల్ మృతదేహాన్ని అంతకుముందే వీరయ్య కుటుంబ సభ్యులకు ఇచ్చినట్టు వెల్లడైంది. మరింత ఆరా తీస్తే వీరయ్య కుటుంబ సభ్యులు ఖలీల్ మృతదేహానికి అంత్యక్రియలు కూడా నిర్వహించేశారని తేలింది. దాంతో నిర్లక్ష్యం వ్యవహరించిన ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఖలీల్ కుటుంబం అధికారులకు ఫిర్యాదు చేసింది.

Related posts