తిరుమల శ్రీవారి ఆన్ లైన్ లక్కీడిప్ సేవా టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. 2020 మే నెలకు సంబంధించి 72,773 టికెట్లు విడుదల చేశారు. ఎలక్ట్రానిక్ లాటరీ విధానం కింద 11,498 టికెట్లను భక్తులకు అందించనున్నట్టు పేర్కొంది. సుప్రభాతానికి సంబంధించిన 8,143 టికెట్లను అందుబాటులో ఉంచినట్టు వెల్లడించింది.
120 చొప్పున తోమాల, అర్చన సేవా టికెట్లను, 240 అష్టదళ పాదపద్మారాధన టికెట్లను, 2,875 నిజపాద దర్శనం టికెట్లను లక్కీ డిప్ లో అందిస్తామని పేర్కొంది. వీటితో పాటు 2000 విశేష పూజ, 14,725 కల్యాణోత్సవం, 15,400 ఆర్జిత బ్రహ్మోత్సవం, 16,800 సహస్రదీపాలంకరణ సేవా టికెట్లను భక్తులు ఆన్ లైన్లో లక్కీ డిప్ లేకుండానే బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది.
పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారు: చినరాజప్ప