telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

లాలూకు బెయిల్‌ మంజూరు

Delhi Court grants regular bail to Lalu Family

బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు బెయిల్‌ మంజూరైంది. ఐఆర్‌సీటీసీ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న లాలూకు పటియాల కోర్టు బెయిల్‌ మంజూరు చేస్తూ శనివారం తీర్పును వెలువరించింది. రూ.లక్ష వ్యక్తిగత పూచికత్తుతో రెగ్యూలర్‌ బెయిల్‌కు న్యాయస్థానం అనుమతిచ్చింది.

ఈ కేసులో లాలూ సతీమణి రబ్రీ దేవి, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌కు మధ్యంతర బెయిల్‌ సమయాన్ని జనవరి 28 వరకు పొడిగించినట్లు న్యాయస్థానం తీర్పునిచ్చింది. లాలూ కేంద్ర రైల్వే శాఖమంత్రిగా ఉన్న సమయంలో ఐఆర్‌సీటీసీలో భారీగా అవకతవకలు జరిగాయన్న కారణంగా సీబీఐ అతనిపై చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ప్రస్తుతం లాలూ రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.

Related posts