telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

8 నెలల పాపను అత్యంత్య కిరాతకంగా చంపిన తల్లి… 46 చోట తీవ్ర గాయాలు

Baby

యూరప్ ఖండంలోని బెలారస్ దేశంలో ఘోరం జరిగింది. ఇద్దరు కుమారులతో కలిసి మార్కెట్‌కు వెళ్లిన లియోనిడ్ అనే వ్యక్తి ఇంటికి తిరిగొచ్చేసరికి ఓ భయంకరమైన దృశ్యం అతని కంటబడింది. తన ఎనిమిది నెలల పాప తలలేని మొండెం రక్తపు మడుగులో పడిఉంది. అది చూసిన లియోనిడ్ గుండె పగిలినంత పనైంది. వెంటనే అంబులెన్సుకు ఫోన్ చేశాడు. అక్కడకు వచ్చిన అంబులెన్సు డాక్టరు ఆ ఇంట్లోని దృశ్యం చూసి స్పృహతప్పిందంటేనే.. అది ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాను ఇంటి నుంచి వెళ్లేప్పుడు భార్య నటాలియా కోల్బ్, ఫ్యామిలీ ఫ్రెండ్ విక్టర్ స్యారేల్ అక్కడే కూర్చొని మద్యం తాగుతున్నారని లియోనిడ్ చెప్పాడు. ఆ మద్యం మత్తులోనే వారిద్దరూ ఎనిమిది నెలల పాపను అత్యంత కిరాతకంగా హింసించారని, ఆ తర్వాత వంటగదిలోని కత్తితో పీకకోసి తలను మొండెం నుంచి వేరు చేశారని దర్యాప్తులో తేలింది. ఆ చిన్ని పాప శరీరంపై 46 చోట్ల తీవ్రమైన గాయాలున్నాయని వైద్యులు చెప్పారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. నటాలియా, విక్టర్ కలిసి పాపను హత్య చేశారన్న నిర్ధారణకు వచ్చింది. విక్టర్‌ను తలలో తుపాకీతో కాల్చి మరణశిక్షను అమలు చేయాలని ఆదేశించింది. అలాగే నటాలియాకు 25ఏళ్ల జైలుశిక్ష విధించింది. బెలారస్ చట్టాల ప్రకారం మహిళలకు మరణశిక్ష విధించకూడదు. వారికి వేయగలిగే అత్యంత పెద్ద శిక్ష 25ఏళ్ల జైలే కావడం గమనార్హం.

Related posts