telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు

మరో ఇంటర్ విద్యార్థిని .. ఆత్మహత్య..

another suicide on inter results failure

మరో విద్యార్థిని తెలంగాణ ఇంటర్ బోర్డు చేసిన తప్పుకు ఆత్మహత్య చేసుకుంది. తాజాగా ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు మనస్తాపం చెందిన ఓ బాలిక ప్రాణాలు తీసుకుంది. నారాయణపేట్ జిల్లా ధన్వాడ మండలం కోడ్రోన్ పల్లి గ్రామానికి చెందిన శిరీష ఒంటిపై కిరోసిన్ పోసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తాను బాగా చదివినప్పటికీ ఇంటర్‌లో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో ఆవేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని ఓ కళాశాలలో శిరీష ఇంటర్ బైపీసీ చదువుతోంది.

జువాలజీ పరీక్షలో తప్పడంతో మనస్తాపానికి గురైన యువతి ఇంటి పైకి వెళ్లి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటల బాధ తట్టుకోలేక పైనుంచి కిందకు దూకేసింది. పై నుంచి కిందకు దూకడంతో స్పాట్‌లోనే చనిపోయింది. మరోవైపు శిరీష మరణంపై కేసు నమోదు చేసిన నారాయణపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts