నేడు అవినీతి నిరోధకశాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా వివిధ చోట్ల జరిపిన రైడ్లో పలువురు ప్రత్యక్షంగా పట్టుబడ్డారు. నగరంలోని మియాపూర్లో ట్రాన్స్కో ఏడీఈ రమేష్, సబ్ ఇంజినీర్ పాండులు ఏసీబీకి చిక్కారు. సోలార్ ప్యానెల్ అనుమతి కోసం కిషోర్ అనే వ్యక్తి వద్ద రూ. 3,500 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
గోషామహల్ వాటర్ వర్క్స్ సూపరింటెండెంట్ అహ్మద్ రూ. 5 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. బకాయి జీతం ఇచ్చేందుకు కింది ఉద్యోగి వద్ద లంచం డిమాండ్ చేశాడు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పురపాలక కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ నాగయ్య ఇంటి నిర్మాణం అనుమతి కోసం లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా అధికారులు రైడ్ చేసి ప్రత్యక్షంగా పట్టుకున్నారు.