గుజరాత్ లో దారుణం చోటుచేసుకుంది… వివాహ వేడుకలో ఏర్పాటుచేసిన విందు ఆరగించి ఏకంగా 1200మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.గుజరాత్ రాష్ట్రంలో మెహసనా జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే ఒకేసారి ఇంతభారీ సంఖ్యలో అనారోగ్యానికి గురవడంపై ఫుడ్ ఆండ్ డ్రగ్స్ శాఖ అధికారులు రంగంలోకి దిగి ఆహార నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు.
వివర్లాలోకి వెళితే..
గుజరాత్ రాష్ట్రంలోని మెహసనా జిల్లాలోని విస్ నగర్ తాలుకా సలావా గ్రామంలో స్థానిక కాంగ్రెస్ నేత కుమారుడి పెళ్లిలో విందు భోజనం చేసిన 1200 మందికిపైగా అతిథులు ఆసుపత్రి పాలయ్యారు. పెళ్లిలో ఏర్పాటు చేసిన విందులో ఆహారం కలుషితం కావడం వల్ల ఇది జరిగి వుంటుందని భావిస్తున్నారు. ఆహారం తీసుకున్న తర్వాత చాలామంది వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి సమస్యలతో బాధపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. విందులో ఏర్పాటు చేసిన ఆహార నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్టు పోలీసులు తెలిపారు.