telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

శ్రీనగర్ లో గత రాత్రి భూకంపం..ఇళ్ల నుంచి పరుగెత్తిన ప్రజలు!

4 earthquakes in arunachal pradesh

 

జ‌మ్ముకశ్మీర్‌లో మరోసారి భూకంపం సంభ‌వించింది. గత రాత్రి శ్రీన‌గ‌ర్‌ సమీప జిల్లాల్లో సంభవించిన భూకంపంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు.  రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ (ఎన్సీఎస్) వెల్లడించింది.

భూమికి 5 కిలోమీటర్ల లోపల ప్రకంపనల కేంద్రం ఉందని తెలిపింది. గత రాత్రి 9.40 గంటల సమయంలో భూకంపం వచ్చిందని ఎన్సీఎస్ వెల్లడించింది. ఈ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. భయంతో ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగెత్తారు.

ఈ ఘటన చాలా భయాన్ని కలిగించింది. ప్రతి ఒక్కరూ క్షేమంగానే ఉన్నారని అనుకుంటున్నాను” అని శ్రీనగర్ జిల్లా మేజిస్ట్రేట్ షాహీద్ చౌధురి తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. ఇక తాము ఎదుర్కొన్న పరిస్థితి గురించి పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. ప్రాణనష్టంపై మాత్రం ఎలాంటి సమాచారం లేదు.

Related posts