telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కరీంనగర్ లో ఉండే బండి సంజయ్ కు హైదరాబాద్ గురించి ఏం తెలుసు..?

talasani srinivas yadav

మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ… ఆఫ్ఘనిస్తాన్, రోహింగ్యాలు 40 వేల మంది హైదరాబాద్ లో వుంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ , బలగాలు ఏమి చేస్తున్నాయని అయన ప్రశ్నించారు. మేము హైదరాబాద్ లో పుట్టి పెరిగినం… మీకు హైదరాబాద్ లో ఏమి పని..? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్ల గోస చూస్తే ఘోరం అనిపిస్తుంది. కాంగ్రెస్ మేనిఫెస్టో చూస్తే నవ్వు వస్తుంది.ఆర్టీసీ, మెట్రో , ghmc కి సంబంధం ఏంటి ? అని ఆయన ప్రశ్నించారు. కరీంనగర్ లో వుండే బండి సంజయ్ కు హైదరాబాద్ గురించి ఏమి తెలుసు..? అని ఆయన ప్రశ్నించారు. మీకు దమ్ముంటే మీరు ఎవరైతే ఇక్కడ ఉండొద్దు అనుకుంటున్నారో వారిని దేశం నుంచి బహిష్కరించండి అంటూ సవాల చేశారు. బిజెపి నేతలు మదం పట్టి మాట్లాడుతున్నారా ? అని అయన ప్రశ్నించారు. 10 శాతం ఉన్న మైనార్టీ ఓటు బ్యాంకు చుట్టే రాజకీయం చేయటం సిగ్గు చేటని అన్నారు. ఢిల్లీ నుంచి టూరిస్ట్ ల్లాగ  స్మృతి ఇరానీ, జవదేకర్ వచ్చి ఇక్కడ ఎంది మీరు మాట్లాడేది.. తమాషా చేస్తున్నారా.. ఏమనుకుంటున్నారు? అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో మమ్మల్ని మించినోళ్లు ఎవరున్నారు.. మా సీఎం మా నోర్లు కట్టిపడేసాడు.. మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎంటి మాట్లాడేది..? లా అండ్ ఆర్డర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గా ఎవరిని స్పేర్ చేయం.. అణిచివేస్తామని అన్నారు.

Related posts