telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కరోనా పోరాటయోధుల కుటుంబాలను ఆదుకోవాలి: పవన్ కల్యాణ్

pawan

కొవిడ్ విధులు నిర్వర్తిస్తూ చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. .ఒక్కో కుటుంబానికి రూ.1 కోటి పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అన్నారు.

కరోనా బారిన పడిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి వేతనంతో కూడిన ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని కోరారు. ప్రైవేటు సంస్థల యాజమాన్యాలు కూడా ఈ విషయంలో సానుభూతితో ఆలోచించాలని సూచించారు.కరోనా పేరు వింటేనే వణికిపోయే పరిస్థితుల్లో ఆ వైరస్ బారిన పడినవారికి సేవలందిస్తున్న ఆయా శాఖల సిబ్బందిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దని పవన్ పేర్కొన్నారు.

Related posts