టీవీ నటి ఝాన్సీ మృతిపై ఆమె కుటుంబ సభ్యులు హైదరాబాదులోని పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూర్య వేధింపుల వల్లనే ఝాన్సీ మరణించిందని వారు ఆరోపించారు. పెళ్లి పేరుతో తన సోదరిని సూర్య మోసం చేశాడని ఝాన్సీ సోదరుడు దుర్గాప్రసాద్ అంటున్నాడు. పెళ్లి చేసుకుంటానని సూర్య చెప్పడంతో తమ సోదరి సినిమా అవకాశాలు కూడా వదులుకుందని చెప్పాడు.
ఝాన్సీ పుట్టిన రోజు సూర్య ఓ అమ్మాయి ద్వారా నా కూతురు కు పరిచయమయ్యాడని తల్లి చెబుతోంది. అప్పటి నుంచి సూర్య తమ ఇంటికి వస్తూ పోతూ, ఝాన్సీతో పాటు తిరిగాడని ఆమె తెలిపింది. ఝాన్సీ సోదరుడు దుర్గాప్రసాద్, తల్లి అన్నపూర్ణమ్మ వాంగ్మూలాలను పంజగుట్ట పోలీసులు రికార్డు చేశారు. ఝాన్సీ ఫోన్ ను పోలీసులు అన్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు ఝాన్సీ సెల్ఫీ వీడియో తీసుకుందని అంటున్నారు. ఆ సెల్ఫీ వీడియోను సూర్యకు పంపించినట్లు భావిస్తున్నారు.