telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఒవైసీపై కాల్పులు.కేటీఆర్ ఘాటుగా స్పందించారు

  • ఒవైసీ కాన్వాయ్‌పై కాల్పుల కలకలం
  • కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఖండించిన మంత్రి కేటీఆర్
  • పిరికిపందల చర్యని ఆగ్రహం , ఒవైసీపై కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది

ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కాల్పుల ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కాన్వాయ్‌పై కాల్పులను తీవ్రంగా ఖండిస్తున్నానని వెల్లడించారు.

ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మీరట్ జిల్లాలోని కిథౌర్‌ నుంచి ఢిల్లీ వెళ్తుండగా చిజార్సీ టోల్ గేట్ వద్ద ఈ ఘటన జరిగింది. ఎరుపు, తెలుపు జాకెట్లు వేసుకుని ఉన్న ఇద్దరు వ్యక్తులు కాన్వాయ్‌పై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Related posts