- కితౌర్ ప్రాంతంలో పర్యటన
- ఓ టోల్ గేట్ వద్ద ఒవైసీ కారుపై 4 రౌండ్ల కాల్పులు
- దుండగులు ముగ్గురు, నలుగురు ఉండొచ్చని తెలిపారు.
- ప్రచారానికి వెళ్లిన మీరట్ వెళ్లిన ఒవైసీ.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రచారానికి వెళ్లిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై కాల్పులు జరిగాయి. తన వాహనంపై 4 రౌండ్లు కాల్పులు జరిగినట్టు ఒవైసీ వెల్లడించారు.
కాల్పులు జరిపిన అనంతరం వారు ఆయుధాలు పడేసి పారిపోయారని, ఈ ఘటనలో తన కారు టైరుకు పంక్చర్ అయిందని ఒవైసీ వివరించారు. దాంతో తాను మరో వాహనంలోకి మారి అక్కడ్నించి క్షేమంగా బయటపడ్డానని, అల్లా దయతో ఎలాంటి ముప్పు సంభవించలేదని వ్యాఖ్యానించారు.
చిజార్సీ టోల్ గేట్ వద్ద ఈ ఘటన జరిగిందని ఆయన ట్విట్టర్ లో వెల్లడించారు. కారుకు బుల్లెట్లు తగిలిన ఫొటోను కూడా పంచుకున్నారు.
—–