telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మంత్రి మేకపాటికి కరోనా పాజిటివ్

Mekapati ycp

కరోనా మహమ్మారి ఎవరిని వదలడం లేదు. ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. తాజాగా ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విటర్ వేదికగా తెలిపారు. ప్రస్తుతం మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హైదరాబాదులో హోం ఐసోలేసాషన్ లో ఉన్నారు. స్వల్పంగా జ్వరం ఉండటంతో డాక్టర్ల పర్యవేక్షణ ఉన్నారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. కాగా ఏపీలో 24 గంట‌ల్లో రాష్ట్రంలో 41,871 శాంపిల్స్ పరీక్షించగా 10,759 మందికి కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది. 24 గంట‌ల్లోనే కోవిడ్‌తో 29 మంది మృతి చెంద‌డం క‌ల‌క‌లం రేపుతోంది. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 997462కు చేర‌గా.. యాక్టివ్ కేసులు 66944గా ఉన్నాయి.. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు 922977 క‌రోనా నుంచి కోలుకోగా 7541 మంది ప్రాణాలు కోల్పోయారు.

Related posts