నేటి ఎన్నికల ఫలితాలు ఆయా పార్టీలకు అనూహ్య ఫలితాలను ఇచ్చాయి. ఒకరికి తిరుగులేని విజయం..చేకూర్చి, కేంద్ర పీఠం కట్టబెడితే; ఇంకొకరికి రాష్ట్ర పీఠం కట్టబెట్టింది. ఇంకొందరికి డిపాజిట్లు లేకుండా చేసింది..
తెలుగు రాష్ట్రాలలో కూడా అదే ఫలితాలు కొనసాగాయి. పీఠం దక్కింది కొందరికి, డిపాజిట్ గల్లంతు ఇంకొందరికి. ఇక తెలంగాణాలో తెరాస నేత కవిత రైతుల ఆగ్రహానికి బలిఅయిపొయింది. బీజేపీ, కాంగ్రెస్ పుంజుకున్నాయనే చెప్పాలి. ఇది తెరాస కు చెంప పెట్టు. తరువాతి ఎన్నికల ఫలితాలు ఇప్పుడే కనిపించాయి అని తెరాస జాగర్తగా పరిపాలన సాగిస్తేనే భవిష్యత్తు..లేదంటే, ఏపీలో టీడీపీ లా రాబోవు ఎన్నికలలో మట్టి కరవక తప్పదు.
మొత్తానికి..సంబరాలు మొదలు..ఎవరు గెలిచినా..5 ఏళ్లు బరించక తప్పదు. లెట్స్ సెలెబ్రేట్..💐🎊