అమరావతిలోని ప్రజావేదిక అక్రమ నిర్మాణమని ప్రభుత్వం దాన్ని కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. కూల్చివేత పనుల్లో భాగంగా ఐరాన్ రాడ్స్ కట్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు పక్కనే ఉన్న ఫైబర్ రేకులకు అంటుకోవడంతో ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు. పక్కనే చంద్రబాబు నివాసం ఉండడంతో తక్షణమే స్పందించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
లోకేశ్ పదవి పోతుందని చంద్రబాబు భయం: మంత్రి బొత్స