telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

గతంలో టీడీపీ నేతలు కక్ష సాధింపులకు పాల్పడలేదా…?

Somu-Veerraju bjp

చంద్రబాబుకు సిఐడి నోటీసులు రావడం ఇంకా ఏపీలో హల చల్ చేస్తూనే ఉంది. అయితే అమరావతి భూముల అక్రమాలపై టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు నిన్న నోటీసులు ఇచ్చారు ఏపీ సీఐడీ అధికారులు.. 41వ సీఆర్‌పీసీ కింద చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిన అధికారులు.. విచారణకు హాజరు కావాల్సిందిగా పేర్కొన్నారు. అయితే, చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.. దురుద్దేశంతోనే చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. అయితే, ఈ పరిణామాలపై వెరైటీగా స్పందించారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు.. సీఐడీ నోటీసులను టీడీపీ నేతలు కక్ష సాధింపు అనడం హాస్యాస్పదం అని వ్యాఖ్యానించిన ఆయన.. గతంలో మాపై టీడీపీ నేతలు కక్ష సాధింపులకు పాల్పడలేదా? అని ప్రశ్నించారు. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినప్పుడు బ్లాక్ బెలూన్స్, ప్లకార్డులు ప్రదర్శించారు.. కేంద్ర మంత్రి అమిత్‌షా.. తిరుపతి పర్యటనలో రాళ్లదాడి చేశారని గతంలో జరిగిన అన్ని ఘటనలను గుర్తుచేశారు. అయితే చూడాలి మరి దీని పై టీడీపీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది. 

Related posts