స్థానిక ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుపై వైసీపీ శ్రేణులు అసంతృప్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు విశాఖ పార్టీ నగర కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఎప్పటి నుంచో పార్టీ జెండా మోసే వారిని, గెలిచే అవకాశం ఉన్న వారిని పక్కన పెట్టారన్నారు.
నాయకుల కుటుంబ సభ్యులు, బంధువులకే టికెట్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు. అధిష్టానం జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని తెలిపారు. ఇలా అయితే ఎన్నికల్లో పార్టీ పరాజయం పొందుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గెలిచే వారికి టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.