telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

రష్యా పక్కకు చేరాలని ఉవ్విళ్లూరుతున్న.. కిమ్, ..వణికి పోతున్న అమెరికా.. !

kim meeting with russia america fears

అమెరికా తో దోస్తీ ఎంతకీ కుదిరేట్టుగా లేదని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌జాంగ్‌ ఉన్‌ ఇపుడు తనకు సానుకూలంగా ఉన్న దేశాలతో సయోధ్యకు మరింతగా కృషిచేస్తున్నారు. 35 ఏళ్ల కిమ్‌ ఇపుడు తాజాగా రష్యాతో ఉన్న పాత దోస్తీని పునరుద్ధరించుకుంటున్నారు. ఇందుకు రష్యాలోని తూర్పు తీరంలో సుదూరంగా ఉన్న వ్లాదివోస్టాక్‌ ఓడరేవును చర్చల వేదికగా ఎంచుకున్నారు. ఈనెల చివరివారంలోనే ఈ చారిత్రాత్మక ఘట్టం కూడా ఉండవచ్చని రష్యా అధ్యక్షభవనం అధికారులు కూడా భావిస్తున్నారు. అయితే కిమ్‌జాంగ్‌ ఉన్‌తో సమావేశం పట్ల పోర్టుసిటీగాపేరొందిన వ్లాదివోస్టోక్‌ స్థానికులు కూడా ఎంతో ఆతృతతో ఉన్నారు. అణ్వాయుధ సంపత్తితో తనకు తానే సాటి అని అమెరికాకు సైతం కంటిమీద కునుకులేకుండాచేసిన కిమ్‌తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌పుతిన్‌ చర్చలు జరుపుతున్నారన్న వార్తలు అక్కడి వాసులకు ఎంతో ఉత్కంఠను కలిగిస్తున్నాయి.

అమెరికా-రష్యాల మధ్య వైరం ఉప్పునిప్పులాంటిదన్న సంగతి తెలిసిందే. రష్యాపై విధించిన ఆంక్షలకు ఎంతమాత్రం వెరవని రష్యా తనదైనశైలితో ఇతర దేశాలను కలుపుకునిపోతున్నది. కొన్ని దేశాలకు అవసరమైతే దౌత్యపరంగా ఇతర దేశాలతో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు సాయం చేస్తోంది. ఒకసారి సింగపూర్‌, మరోసారి తైవాన్‌ రాజధాని థైపేయిల్లో చర్చలు జరిగిన తర్వాత చర్చల్లో ఆశించినంత పురోగతి కనిపించకపోవడం తిరిగి అవసరమైతే అణుపరీక్షలునిర్వహిస్తామన్న కిమ్‌జాంగ్‌ ప్రకటనలు కొంత కలవరం కలిగించేవిగా ఉన్నా, కొత్తగా రష్యాతో చర్చలు జరిపేందుకు ఆసక్తి చూపించడం పట్ల సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

రష్యాతో ఉత్తరకొరియాకు ఉన్న సరిహద్దుకు 130 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఈ ఓడరేవు నగరాన్నే ఎంచుకోవడం భద్రతా కారణాలరీత్యానేనని తెలుస్తోంది. కిమ్‌ జాంగ్‌ తండ్రి కిమ్‌జాంగ్‌ ఇల్‌ కొత్తగా ఎన్నికైన పుతిన్‌ను 2002లోనే గతంలో వ్లాదివోస్టోక్‌లో కలుసుకని చర్చలు జరిపారు. ఇప్పుడు కిమ్‌ కూడా తన తండ్రి బాటనే కొనసాగిస్తున్నారు. రష్యా ఉత్తరకొరియా అధిపతులమధ్య చిట్టచివరిసమావేశం 2011లో జరిగింది. కిమ్‌ తండ్రి సైబీరియాకు ప్రత్యేక సాయుధ రైలులో ప్రయాణించిన సందర్భంగానే ఈ సదస్సు జరిగింది. అంతేకాకుండా సైబీరియాలో కిమ్‌ తండ్రి మైకాల్‌ సరస్సులో బోట్‌షికారుకూడా చేసారు. ఆ పర్యటనలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య అప్పటి రష్యా అధ్యక్షుడు డిమిత్రీ మెద్వెదేవ్‌తో చర్చలుజరిపారు. అప్పటినుంచి మళ్లీ చర్చలే జరగలేదు. రెండోప్రపంచ యుద్ధం 70వ వార్షికోత్సవ సంబరాలను మాస్కోలో నిర్వహించిన సందర్భంలో కూడా 2015లో ఆ ఉత్సవాలకు కిమ్‌జాంగ్‌ హాజరుకాలేదు.

తాజాగా కిమ్‌ స్వయంగా తాను రష్యా అధ్యక్షునితో చర్చలుజరపాలని భావిస్తుండటంతో ఇందుకోసం ఆయనకు సానుకూలంగా ఉన్న పోర్టుసిటీనే యుద్ధప్రాతిపదికన సిద్ధంచేస్తున్నారు. గతంలో కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తానున కూడా కిమ్‌తో చర్చలుజరిపేందుకు సిద్ధమేనని, మాస్కోలోజరిగిన కోల్డ్‌వార్‌లో మిత్రదేశంగా నిలిచిన ఉత్తరకొరియాతో అణుసంపత్తిపరంగా చర్చలుజరిపేందుకు తాముకూడా సిద్ధమైనని పుతిన్‌ ప్రకటించారు. అమెరికాతో ఎదురవుతున్న ఆంక్షలు, వాణిజ్యదౌత్యపరమైన అంశాల్లో రెండుదేశాలమధ్య నెలకొన్న వైరం, అంతర్జాతీయంగా కూడా కొన్ని అగ్రరాజ్యాలుగాభావిస్తున్న దేశాలు రష్యాపై వైరం ప్రకటించడం వంటివాటిని అధిగమిస్తూ వస్తున్న పుతిన్‌ ఇపుడు ఉత్తరకొరియా అధ్యక్షునితో జరిపే చర్చలు కూడా వ్యూహాత్మకమేనని భావించాల్సి వస్తోంది. రష్యా తనవరకూ అటు చైనా, ఇటు బ్రిక్స్‌ దేశాలతోపాటు తనకు సానుకూలంగా ఉన్న అన్ని దేశాలతోను సంబంధాలు దౌత్యబంధాలు, ఎగుమతిదిగుమతుల వాణిజ్యం కొనసాగిస్తోంది.

అణుసంపత్తిపరంగాచూస్తే ఉత్తరకొరియావద్ద అణునిల్వలు భారీస్థాయిలో ఉన్నందువల్లనే అణుపరీక్షలు యధేఛ్ఛగా నిర్వహిస్తోంది. గురిచూసి అమెరికాలోని దుర్భేద్యమైన నగరాన్ని సైతం లక్ష్యంగాచేసుకుని అణుక్షిపణులు ప్రయోగించే సామర్ధ్యం ఉన్నందువల్లనే ట్రంప్‌ సైతం ఉత్తరకొరియాతో చర్చలకు ఉపక్రమించారు. కిమ్‌తో రష్యా చర్చలుజరిపిన పక్షంలో ఇకముందు భవిష్యత్తులో ఉత్తరకొరియా అణుపరీక్షలు జరిపితే వ్లాదివోస్టోక్‌ ఉత్తర కొరియా అగ్ని కీలల్లోనికి చేరుతుందన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. చర్చల వివరాలను భద్రతాకారణాలరీత్యా అత్యంత గోప్యంగానే ఉంచిన ఇరుదేశాలు కిమ్‌తో జరిపే చర్చలపై ఇప్పటికే అజెండాను రూపొందించినట్లు తెలుస్తోంది. అమెరికా తర్వాత కిమ్‌జాంగ్‌ రష్యాతో జరిపే చర్చలపట్ల ప్రపంచ దేశాలు అత్యంత ఆసక్తిగా గమనిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహంలేదు. ఇది అమెరికాకు చాలా పెద్ద చేదు వార్త, కనుక దీనికి కూడా ఏదో ఒక పుల్ల వేయకుండా ఉంటుందా.. వేచి చూద్దాం..!

Related posts