telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బండి సంజయ్‌ ఏడాదిన్నరగా ఏం చేసాడు: తలసాని

Talasani Trs

కరీంనగర్‌ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ పై తెలంగాణ పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో కూర్చుని పిచ్చిపిచ్చిగా మాట్లాడ్డం తప్ప తన నియోజక వర్గానికి ఏమైనాచేశాడా? అంటూ తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీకు దమ్ముంటే ప్రధాన మ్రంతి వద్ద కూర్చుని డబ్బులు తెచ్చి చూపించాలని సవాల్‌ విసిరారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తుగ్లక్‌లా వ్యవహరిస్తోందని విమర్శించారు.

కరోనా విషయంలో 20లక్షల కోట్ల నిధులు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకూ గైడ్‌లైన్స్‌ కూడా ఇవ్వలేదన్నారు. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలతోపాటు దేశంలో కలిసి వచ్చే అందరు ఎంపీలతో కలిసి ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. తెలంగాణ పలు సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులతో అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంటే ఓర్వలేకనే ప్రభుత్వం పై ఆరోపణలుచేస్తున్నారని పేర్కొన్నారు.

Related posts