ఏపీలో పింఛన్ల పంపిణీ జాప్యంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. శ్రీకాకుళం జిల్లాలో పలువురికి అకారణంగా పింఛన్లు నిలిపేయడంలోని ప్రభుత్వ వైఖరిని ఏపీ హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టిందంటూ పలు పత్రికల్లో వచ్చిన వార్తలను ఆయన ఈ సందర్భంగా పోస్ట్ చేశారు.
ప్రభుత్వ ఆఫీసులకు పార్టీ రంగులు వేయడం పట్ల ఉన్న శ్రద్ధ వితంతువుల పింఛన్లపై లేకపోయిందని కోర్టు దుయ్యబట్టిందని అందులో ఉంది. ధ్రువీకరణ పత్రాలు లేవన్న సాకుతో వితంతువులు, ఒంటరి మహిళలకు పింఛన్లు నిలిపేయడాన్ని ఆక్షేపించిందని అందులో పేర్కొన్నారు.
కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడంపై ఉన్న శ్రద్ధ పేదవారిపై ఏది? అని ప్రశించారు. రాజకీయకారణాలతో పింఛన్లను ఎలా ఆపుతారని నిలదీశారు. ప్రజాధనం పౌరుల ఆస్తి, సర్కారు ధర్మకర్త మాత్రమే ఆత్మ విమర్శ చేసుకోండని సీఎం జగన్ కు హితవు పలికారు.
గత సందాయాలను పాటించలేదు: అచ్చెన్నాయుడు