తెలంగాణ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సిద్దిపేట జిల్లాలోని మార్కుక్ మండలం ఎర్రవల్లి లో ఈ ఘటన చోటుచేసుకొంది. రోడ్డుపై నిర్లక్ష్యంగా పడేసిన రాళ్ల లోడ్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. శ్రీగిరిపల్లెకు చెందిన భార్యభర్తలు మార్కుక్ రూట్లో బైక్ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ఘటనలో బీబీ (భార్య) అక్కడికక్కడే మృతి చెందగా, భర్త శబద్దీన్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక సమాచారం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడ్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు బీబీ మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వైసీపీ ప్రభుత్వానికి ఆత్రమే తప్ప శ్రద్ధ కొరవడింది: కన్నా