telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ ప్రభుత్వానికి ఆత్రమే తప్ప శ్రద్ధ కొరవడింది: కన్నా

Kanna laxminarayana

వైసీపీ ప్రభుత్వానికి ఆత్రమే తప్ప శ్రద్ధ కొరవడిందని రాష్ట్ర బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. గుంటూరు చంద్రమౌళి నగర్ లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కన్నా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ అనవసర విషయాల్లో అత్యుత్సాహం చూపుతూ, అవసరమైన విషయాలను పట్టించుకోవడం లేదన్నారు.

జగన్ చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులకు ఏమాత్రం పొంతన కనిపించడంలేదని తెలిపారు. నిర్మాణ రంగంలో ఎంతో కీలకమైన ఇసుక విషయంలో జగన్ ఎంతుకు తాత్సారం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఇసుక సరఫరా లేక ప్రజలు, కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కన్నా పేర్కొన్నారు.

Related posts