telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

ఎన్నికల్లో లబ్ధి కోసమే అగ్రవర్ణ రిజర్వేషన్లు: ఎంపీ నర్సయ్యగౌడ్‌ 

ఎన్నికల్లో లబ్ధి కోసమే అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్‌లను బీజేపీ తెరపైకి తెచ్చిందని భువనగిరి టీఆర్‌ఎస్‌ ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ ఆరోపించారు.
జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  అగ్ర వర్ణ పేదలకు రిజర్వేషన్ల కోసం సీఎం కేసీఆర్‌ ఏనాడో గళమెత్తారన్నారు. బీజేపీ రాష్ట్రంలో రిజర్వేషన్లపై కుట్రపూరితంగా వ్యవహరిస్తుందన్నారు.  
రిజర్వేషన్ల కల్పనపై కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు కల్పించాలన్నారు. త్వరలో జరిగే స్థానిక సమరంలో  ప్రజలు  టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులకు ఘన విజయం అందించాలన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే పల్లె ప్రగతి సాధ్యమవుతుందన్నారు. జనగామలోని వీవర్స్‌కాలనీ వద్ద రైల్వేలైన్‌పై అండర్‌పాస్‌ నిర్మాణానికి టెండర్‌ ప్రక్రియ కూడా ఖరారైందని పేర్కొన్నారు.

Related posts