telugu navyamedia
రాజకీయ వార్తలు

ప్రధాని పదవి ఎవరిని వరిస్తుందో: దేవెగౌడ

devegowda umaraswamy

ఈసారి ప్రధాని పదవి ఎవరిని వరిస్తుందో తెలియదని కర్ణాటక జేడీఎస్ చీఫ్, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ అన్నారు. తన కుమారుడు, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో కలిసి ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాము మాత్రం కాంగ్రెస్‌తోనే ఉంటామని తేల్చి చెప్పారు.

వర్షాలు సకాలంలో కురిసి కర్ణాటక, తమిళనాడు రైతుల సాగునీటి సమస్యలు తీరేలా చూడాలని స్వామిని వేడుకున్నట్టు తెలిపారు. అనంతరం సీఎం కుమారస్వామి మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి 18 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

Related posts