ఆటల్లో రాణించే విద్యార్థులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం చేస్తుందని తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కరీంనగర్లోని ఆల్ఫోర్స్ ఈ-టెక్నో స్కూల్లో మిక్స్డ్ నెట్ బాల్ జాతీయస్థాయి ఛాంపియన్షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు.క్రీడాకారులు ప్రదర్శించిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ విద్యతో పాటు క్రీడలలో విద్యార్థులు రాణించాలని చెబుతుంటారని మంత్రి గుర్తు చేశారు. ఈ పోటీల్లో తెలంగాణ ఆటగాళ్లు అద్భుతంగా రాణించి, విజేతగా నిలవాలని మంత్రి ఆకాంక్షించారు. ఆటగాళ్లు క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఆయా రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొన్నారు.
కేంద్రం హెచ్చరిస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: సుజనా చౌదరి