ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి పెరుగుతూ, తగ్గుతూ ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూనే వున్నాయి. అయితే…ఇవాళ మాత్రం కేసులు కాస్త తగ్గాయి. ఇప్పటికే రాష్ట్రంలో 8.59 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. అందులో ఏపీలో కొత్తగా 1,221 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,59,932 కి చేరింది. ఇందులో 8,37,630 మంది ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, 15,382 కేసులు ఇంకా యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 10 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 6920 కి చేరింది. అలానే జిల్లా వారీగా చూస్తే అనంతపురంలో 41, చిత్తూరులో 175, తూర్పుగోదావరి జిల్లాలో 202, గుంటూరులో 144, కడపలో 65, కృష్ణాలో 198, కర్నూలులో 19, నెల్లూరులో 47, ప్రకాశంలో 50, శ్రీకాకుళంలో 34, విశాఖపట్నంలో 69, విజయనగరంలో 32, పశ్చిమ గోదావరిలో 145 కేసులు నమోదయ్యాయి.
previous post