హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ తల్లి, జయశంకర్ విగ్రహాలకు పుష్పాంజలి సమర్పించి ఘన నివాళులర్పించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వపరిపాలనలో బంగారు తెలంగాణకు పునాది పడిన రోజు అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బంగారు తెలంగాణ సాధించుకునేందుకు అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. నేడు 60 ఏళ్ల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిన రోజు అని అన్నారు.
మిగతా విషయాలపై మాట్లాడే దమ్మే లేదు: విజయసాయి రెడ్డి