ఏపీ సీఎం చంద్రబాబు త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పై ప్రైవేట్ సర్వే చేయించారు. అధికార తెలుగుదేశం పార్టీకీ 140 నుంచి 145 సీట్లు వస్తాయని ఓ ప్రైవేట్ సర్వే వెల్లడించింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు గాను 103 సీట్లను టీడీపీ కైవసం చేసుకుంది. మిత్రపక్షమైన బీజీపీ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. గత ఎన్నికల్లో రాయలసీమలోని 52 స్థానాలకు గాను 23 స్థానాలను టీడీపీ దక్కించుకుంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రెడ్డి సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉండడంతో ఆ రెండు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కొంత బలహీనంగా ఉన్నట్టు సర్వేలో తేలింది.
2014 ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలోని 12 స్థానాలకు గాను కేవలం 5 స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది. నెల్లూరు జిల్లాల్లో 10 స్థానాలకు గాను 3 స్థానాలను దక్కించుకుంది. గతంలో కంటే ఈ సారి రాయలసీమలో పార్టీ పుంజుకున్నట్టు సర్వేలో వెల్లడైంది. గత సంవత్సరం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కాలేదన్న ఆరోపణలు వెల్లువిరుస్తున్నాయి. గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లను ఆకట్టుకుంటే టీడీపీ తిరిగి మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ప్రైవేట్ సర్వే వెల్లడించింది.
హోదా విషయంలో ప్రజలను మభ్యపెట్టొద్దు.. జగన్ పై పురందేశ్వరి ఫైర్!