కాళ్లేశ్వరం నీళ్లు చూసి కాంగ్రెస్ నేతలకు కడుపు మండుతోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులపై నాడు వైఎస్ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు తవ్వకాలు చేపట్టినప్పుడు హారతులు పట్టింది ఎవరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండాకాలంలో కూడా నీళ్లు వస్తుండడం చూసి కాంగ్రెస్ నేతలకు కన్నీళ్లు వస్తున్నాయని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ నేతలు దీక్షలు చేస్తామనడం హాస్యాస్పదం అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతల తీరు హంతకులే సంతాపం తెలిపినట్టుగా ఉందని పేర్కొన్నారు. రైతులకు కేసీఆర్ ఎప్పుడూ అన్యాయం చేయరని కేటీఆర్ అన్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసమే నిరసనలు: మంత్రి అవంతి