telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బీజేపీ గూటికి టీడీపీ నేత చింతమనేని?

Chintamaneni tdp

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వలసలు ఊపందుకున్నాయి. టీడీపికి చెందిన పలువురు నేతలు బీజేపీ గూటికి చేరుతున్నారు. నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీ చేరిన సంగతి తెలిసిందే. అదేవిధంగా మొన్న టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీశ్ కూడా బీజేపీలో చేరిపోయారు. ఇక చాలా కాలంగా పార్టీ దూరంగా ఉంటూ వస్తున్నమాజీ ఎమ్మెల్యే టీడీపీ ఫైర్ బ్రాండ్ చింతమనేని ప్రభాకర్ త్వరలో బీజేపీ గూటికి చేరే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల టీడీపీ అధిష్టానం ఏర్పాటు చేసిన కార్యక్రమాలు కూడా ఆయన దూరంగా ఉన్నారు.

మరోవైపు తన తో పాటుగా కొందరిని బీజేపీ లో చేర్పించేందుకు పావులు కదుపుతునట్టు సమాచారం. ఈవిషయమై ఆయన నిన్న విజయవాడ వచ్చిన మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత సుజనా చౌదరితో ఫోన్ లో మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. ఆయన పై ఉన్న ఓ కేసులో ఇప్పటికే శిక్ష కూడా ఖరారు కావటం, ఇక మిగిలిన కేసులను కదిలిస్తే ఆయన ఖచ్చితంగా జైలుకు వెళ్లె అవకాశాలు ఉన్నందున కాషాయ కండువా కప్పుకోవాలని భావిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. అయితే చింతమనేని పార్టీ మారే విషయం పై ఇప్పటివరకు ఆయన వర్గం నుంచి కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

Related posts