telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమరావతిలో చంద్రబాబుకు ఘన స్వాగతం

chandrababu

హైదరాబాదు నుంచి అమరావతికి రోడ్డు మార్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లారు. ఈ సందర్భంగా ఏపీలో ఆయనకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. దేశమంతా లాక్ డౌన్ పాటిస్తోందని, సామాజిక దూరాన్ని పాటిస్తోందని… ఈ సమయంలో చంద్రబాబు హైదరాబాదు నుంచి ర్యాలీగా వచ్చారని అన్నారు. 

మాస్కులు కూడా ధరించకుండా వందలాది మంది టీడీపీ శ్రేణులు ఆయనకు పూలమాలలతో స్వాగతం పలికారని చెప్పారు. ఒక సీనియర్ పొలిటీషియన్ అయి ఉండి చంద్రబాబు ఇలా ఎలా ప్రవర్తిస్తారని ప్రశ్నించారు. ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.రెడ్ జోన్ గుండా వచ్చిన చంద్రబాబును క్వారంటైన్ కు తరలించాలని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా చంద్రబాబు రాజకీయాలకు పాల్పడుతున్నారని చెప్పారు.

Related posts