telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

భారీ అగ్నిప్రమాదం.. రూ. 2కోట్ల ఆస్తి నష్టం

huge fire in seshachalam forest

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని గ్లాస్‌హౌస్‌ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారు జమున జరిగిన ఈ ప్రమాదంలో రూ. 2కోట్ల ఆస్తి కాలి బూడిదయింది. అక్స్మట్టుగా మంటలు మూడు అంతస్తులకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 8 ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సూపర్ మార్కెట్‌లో ప్లాస్టిక్, స్కూలు బ్యాగులు, బట్టల దుకాణాలు ఉండడంతో పాటు అది పాత భవనం కావడం వల్ల మంటలను అదుపు చేయడం ఫైర్ సిబ్బందికి కష్టంగా మారింది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

Related posts