ఈఎస్ఐ స్కాం కేసులో అరెస్ట్ అయిన టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు మరోసారి చుక్కెదురైంది. ఆయన వేసిన బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఈ కేసులో సంబంధం ఉన్న మిగిలినవారి బెయిల్ పిటిషన్లను కూడా కోర్టు కొట్టివేసింది. . బెయిల్ పిటిషన్లు వేసుకున్న వారిలో రమేశ్ కుమార్, మురళీ, సుబ్బారావు కూడా ఉన్నారు.
అచ్చెన్నాయుడు ఏపీ మంత్రిగా ఉన్న సమయంలో డొల్ల కంపెనీలకు ఆర్డర్లు, పరికరాల కొనుగోళ్లలో అవకతవకలకు వంటి విషయాల్లో అవినీతికి పాల్పడినట్లు అభిమోగాలు నమోదైన విషయం తెలిసిందే. సుమారు 150 కోట్ల రూపాయల అవినీతిలో వాటాలపై సమాచారం సేకరించేందకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు అచ్చెన్నాయుడిని ప్రశ్నించారు. ప్రస్తుతం ఆయన గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇసుక కొరతను ప్రభుత్వమే సృష్టించింది: కన్నా