telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చిన్నకేసుకే సుబ్బారెడ్డిని జైలులో పెట్టారు: చంద్రబాబు

chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబు కడప జిల్లా పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జైల్లో ఉన్న తమ పార్టీ నేత రెడ్యం వెంకట సుబ్బారెడ్డిని కలిసి ఈ రోజు చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.టీడీపీ నేతలపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆ పార్టీ చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

జిల్లాలో పార్టీ పరిస్థితిపై నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించి పార్టీ కార్యకర్తలకు మార్గ నిర్దేశనం చేశారు. చిన్న కేసుకే వెంకట సుబ్బారెడ్డిని జైలులో పెట్టారన్నారు. మరోవైపు పోలీసులు కూడా అతిగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితులను పట్టుకోవడంలో వారు శ్రద్ధ చూపాలని చెప్పారు.

Related posts