telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

లాక్‌డౌన్‌తో కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు: జేపీ

Loksatha comments Janasena

దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌తో కోట్లాది మంది ఉపాధి కోల్పోయారని లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఈ నేపథ్యంలో ఒక పద్ధతి ప్రకారం లాక్ డౌన్ ను క్రమంగా సడలించాలని సూచించారు. లాక్‌డౌన్‌కు ప్రజలు గొప్పగా సహకరిస్తున్నారని చెప్పారు. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కరోనా టెస్టింగ్ జరపాలని సూచించారు.

మన దేశంలో కంటే విదేశాల్లోనే ఎక్కువగా కరోనా టెస్టులు జరుగుతున్నాయని చెప్పారు. 60 ఏళ్లు దాటిన వారు ఇంటి నుంచి బయటకు రాకుండా చూడాలని అన్నారు. పెద్ద సంఖ్యలో జనాలు గుమికూడకుండా చూడాలని చెప్పారు. 130 కోట్ల జనాభాలో 200 మంది మరణించడం పెద్ద సంఖ్య కాదని జేపీ అన్నారు.

Related posts