తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి ఉన్నాయి. వైకుంఠం వెలుపల సైతం రెండు కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు.
శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. అలాగే టైమ్స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న 92,429 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.07 కోట్లు.