తెలంగాణలో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులో నిందితుడు మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడ్డ తెలిసిందే. మారుతీరావు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం స్వస్థలం మిర్యాలగూడ తరలించారు. మారుతీరావు నివాసానికి వచ్చిన మీడియా ప్రతినిధులను చూసి ఆయన భార్య గిరిజ తీవ్రస్థాయిలో స్పందించారు.
ఇకనైనా మమ్మల్ని వదిలెయ్యండి, మీడియా వాళ్లూ ఇకచాలండీ అంటూ రెండు చేతులు జోడించి దండం పెట్టారు. దాంతో అక్కడ ఇబ్బందికర వాతావరణం నెలకొంది. ప్రణయ్ హత్యోదంతం తర్వాత మారుతీరావుపై అనేక మీడియా సంస్థలు పెద్ద ఎత్తున కథనాలు ప్రచురించాయి. దీంతో మారుతీరావు అంటే సమాజంలో వ్యతిరేకత ఏర్పడింది.
జైల్లో ఉన్నవారు 90 శాతం బీదవారే: వీకే సింగ్