telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

చంపుతామంటూ విదేశాల నుంచి కాల్స్: బీజేపీ నేత కిషన్‌ రెడ్డి

BJP Kishan Reddy Says Threatening Calls

నాకు విదేశాల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని బీజేపీ సీనియర్‌ నేత కిషన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపుతామంటూ ఇంటర్నెట్‌ ద్వారా ఇస్లామిక్‌ దేశాల నుంచి కాల్స్‌ వస్తున్నాయని తెలిపారు. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తాను హత్యా రాజకీయాలకు పాల్పడ్డానంటూ ఆరోపణలు చేసిన భారత హ్యాకర్‌ సయ్యద్‌ షుజాను పట్టుకుని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈమేరకు ఆయన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. 11 మందిని హత్య చేశానని సయ్యద్‌ షుజా, కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబల్‌ ఆరోపణలు చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌ల ద్వారా బీజేపీ 2014లో గెలిచిందన్నారు. దీనిపై కేం‍ద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తు చేయాలని రాజ్‌నాథ్‌ను కిషన్‌ రెడ్డి కోరారు. 

Related posts