telugu navyamedia
రాజకీయ వార్తలు

రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్‌

election-commission

నేడు రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. జార్ఖండ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కూడా త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది.

అయితే మహారాష్ట్ర, హర్యానాలో దీపావళి(అక్టోబర్‌ 27) పండుగ కంటే ముందే ఎన్నికలు పూర్తి చేయనున్నట్లు సమాచారం. ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుండడంతో ఆ రెండురాష్ట్రాల్లో ఎన్నికల కోడ్‌ నేటి నుంచి అమల్లోకి రానుంది. హర్యానాలో 90, మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Related posts