telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా

Ycp Mla corona

ఏపీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఆయా శాఖల అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను కూడా ఈ మహమ్మారి వదలడం లేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. తాజాగా, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కూడా కరోనా బారిన పడ్డారు. కరోనా అనుమానంతో ఆయన ఇటీవల పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ అని తేలింది. ఆయన భార్య శ్రీవాణిరెడ్డికి కూడా కరోనా సోకింది.

ప్రస్తుతం వారిద్దరు తిరుపతి అమర ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వారికి కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో శ్రీకాళహస్తి వైసీపీ కార్యాలయంలోని సిబ్బంది వివరాలు సేకరిస్తున్నారు. కరోనా పరీక్షల కోసం ఆ ప్రాంతంలోని కార్యకర్తల నుంచి వైద్య సిబ్బంది నమూనాలు సేకరిస్తున్నారు.

Related posts