కంటెంట్ వున్న కథలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “ఏబీసీడీ”. “అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ” అనేది ట్యాగ్ లైన్. సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టును మధుర ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం నుంచి “మెల్లమెల్లగా” అంటూ సాగే పాట విడుదలైంది.
ఇక అసలు విషయానికొస్తే అల్లు శిరీష్ రీల్ హీరోనే కాదు రియల్ హీరో కూడా అంటున్నారు చిత్రబృందం. “మెల్లమెల్లగా…” పాట చిత్రీకరణ సమయంలో కొందరు తాగుబోతులు హీరోయిన్ రుక్సార్ ను కామెంట్ చేశారని, అయితే చిత్రబృందం మొత్తం ఎవరి పనుల్లో వారు ఉండడంతో ఎవరూ పట్టించుకోలేదని, కానీ అల్లు శిరీష్ మాత్రం తన షాట్ పూర్తి కాగానే కారులో వెళ్లి రుక్సార్ ను కామెంట్ చేసిన ఆ తాగుబోతు వ్యక్తిని తీసుకొచ్చి ఆమెకు క్షమాపణలు చెప్పించారని చిత్రదర్శకుడు సంజీవ్ రెడ్డి తెలిపారు. ఇక సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉండే ఈ యంగ్ హీరో ఓ అభిమాని అవసరానికి తన ల్యాప్ టాప్ ను గిఫ్ట్ గా ఇచ్చిన విషయం తెలిసిందే.
కరోనా, ఎయిడ్స్ కంటే శ్రీరెడ్డే ఎక్కువ ప్రమాదం : రాకేష్ మాస్టర్