చిరంజీవి, పవన్కల్యాణ్, నాగబాబు ఈ ముగ్గురూ మెగా బ్రదర్స్గా టాలీవుడ్లో చిరపరిచితులు. ఈ ముగ్గురు బ్రదర్స్ ను ఒకే ఫోటో ఫ్రేమ్లో చూడడానికి మెగా అభిమానులు ఆరాటపడతారు. అయితే తాజాగా ఈ ముగ్గురితో పాటు మరో చిన్నారి ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ ఫొటోలో పవన్ భుజాలపై కూర్చొని ఉన్నాడు. తాజాగా ఈ ఫోటోను వరుణ్ తేజ్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ “పాత జ్ఞాపకాల నుంచి తవ్వి తీసిన చిత్రమిది. నాకు ఎంతో నచ్చిన వ్యక్తులతో నేను. ఈ ప్రపంచంలో వీరినే ఎక్కువ ప్రేమిస్తాను” అంటూ వరుణ్ ట్వీట్ చేశాడు. ఈ ఏడాది సంక్రాంతికి “ఎఫ్-2″తో ఘనవిజయం అందుకున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న “వాల్మీకి”లో నటిస్తున్నాడు.
previous post